Webdunia - Bharat's app for daily news and videos

Install App

12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? ఏపీని నిలదీసిన సుప్రీం

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (18:39 IST)
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా 12వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. 
 
రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో, ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
 
పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని... ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీని ఎందుకు మినహాయించాలని వ్యాఖ్యానించింది. 
 
ముఖ్యంగా, 12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? చెప్పాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి. సెప్టెంబరులో 11వ తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది. 
 
కాగా, అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెల్సిందే. అలాగే, కేంద్రం కూడా ఈ యేడాది  సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. కానీ, ఏపీ మాత్రం పరీక్షలను నిర్వహించితీరుతామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments