Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు - కొలీజియం సిఫార్సు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ఒక్కసారిగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. ఈ నెల 29వ తేదీన సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలో సమావేశమైన కొలీజియం ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 
 
ఈ కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో రవి చీమలపాటి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన్ సుజాత, సత్తి సుబ్బారెడ్డి, తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లులను ఏపీ హైకోర్టుకు జడ్జీలుగా సిఫార్సు చేశారు. వీరంతా సీనియర్ న్యాయవాదులుగా ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి న్యాయమూర్తులుగా నియమించనున్నారు. 
 
కాగా ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 20 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఇపుడు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేశారు. వీరి నియాకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సివుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments