Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు లోపు అమరావతి పిటిషన్లపై విచారణ కదురదు : సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (14:42 IST)
ఏపీ రాజధాని అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ డిసెంబరులోపు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై డిసెంబరులో విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణను అత్యవసరంగా విచారించాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 
 
ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సివుందని, నవంబర్ వరకు ఈ కేసుల విచారణ జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును పరిశీలించి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థనను మన్నించలేమని పేర్కొంది. 
 
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఆరు నెలల్లో అమరావతి రాజాధానిని నిర్మించాలన్న హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కేసు జస్టిస్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల బెంచ్‌కు బదిలీ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments