Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులే కుమార్తెలను హతమార్చారు..

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (11:13 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజల పేరుతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లో మదనపల్లి స్థానిక శివనగర్‌లో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తమ నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తుండగా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేటు విద్యాసంస్థకు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(22) కుమార్తెలున్నారు.
 
ఈ క్రమంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించారు. మొదట సాయి దివ్యను, ఆ తర్వాత అలేఖ్యను వారి నోట్లు చిన్న చెంబులు పెట్టి.. వ్యాయామం చేసే డంబెల్‌తో అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఆ ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు కాలేజీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో డీఎస్పీ రవి మనోహారాచారి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురుషోత్తమనాయుడు, పద్మజ, వారి ఇద్దరు కుమార్తెలు కూడా దైవభక్తితో పూజలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments