Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాతో చెలిమి... సునీల్ దేవ్‌ధర్‌కు బీజేపీ పెద్దల షాక్

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (15:27 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలతో అంటకాగినందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌కు బీజేపీ పెద్దలు తేరుకోలేని షాకిచ్చారు. ఇన్‍చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఐదేళ్లుగా పార్టీపరంగా ఏపీకి అందించిన సేవలు చాలంటూ ఉద్వాసన పలికింది. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా తన బృందంలో సునీల్‌కు చోటివ్వలేదు. 
 
మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవ్‌ధర్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్ షా ఆయనను నియమించారు. 2018, జూలై 30న రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా నియమిచారు. అయితే ఏపీలో సునీల్ సేవలు ఆది నుంచి వివాదాస్పదంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో దేవ్‌ధర్ పనితీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వినిపించాయి. 
 
ముఖ్యంగా మీడియా ముందు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూనే.. తెరవెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చెలిమి చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే, రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న వై.సత్యకుమార్ను అదేస్థానంలో కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments