Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుని రైలు కేసులో నిందితులకు సమన్లు: ముద్రగడ సహా పలువురికి రైల్వే చట్టం కింద జారీ

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:05 IST)
కాపు ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన రైలు దహనం ఘటనలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు శుక్రవారం సమన్లు జారీ అయ్యాయి. 2016 జనవరి 31న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో భారీ బహిరంగ సభ జరిగింది.
 
ఈ సందర్భంగా రత్నచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు దహనం చేశారు. దీనిపై అప్పట్లో రైల్వే పోలీసులు ముద్రగడతో పాటు 41 మందిపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా మార్చి 3న విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.
 
వీరిలో ముద్రగడ పద్మనాభం, మంచాల సాయిసుధాకర్‌ నాయుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయగా రైల్వే కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments