Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (13:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ బుధవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్ 20వ తేదీన కాలేజీలు మళ్లీ పునఃప్రారంభమవుతాయని ఇంటర్ విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇంటర్ మార్కుల వెయిటేజిని తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు. కరోనా కరోనా కారణంగా గత యేడాది ఇంటర్ ఫస్టియర్‌కు పరీక్షలు నిర్వహించలేదు. 
 
దీంతో ఈ వెయిటేజీ మార్కులను తొలగించారు. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండవని తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments