Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే అత్యధికసార్లు అక్కడ మొట్టికాయలు వేసుకుంది జగన్ ప్రభుత్వమే: సుజనా ఫైర్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:21 IST)
దేశంలోనే అత్యధికసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో మొట్టికాయలు వేసుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనన్నారు ఎంపి సుజనాచౌదరి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో తిరుపతిలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. గెలిచిన 21 మంది ఎంపిలతో రెండేళ్లుగా వైసిపి చేసిందేమిటని ప్రశ్నించారు. కనీసం వారికి వచ్చే నిధులు సక్రమంగా వాడలేదన్నారు.
 
బిజెపి అభ్యర్థి రత్నప్రభ గెలుపుతో అభివృద్థి జరుగుతుందని.. కేంద్రం నుంచి నిధులను ఎపికి త్వరగా తీసుకువస్తారన్నారు. అభివృద్థి చేయకుండా పప్పులు, బెల్లాలు పంచుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేల తీరుతో విదేశీ సంస్ధలు మొత్తం భయంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు.
 
బిజెపిని గెలిపిస్తే తిరుపతి ఎంతో అభివృద్థి అవుతుందన్నారు. విభజన చట్టంలో ఉన్నది.. లేనిది కూడా బిజెపి ఎపికి ఇచ్చిందన్నారు. చట్టంలో అసలు హోదా అనేది ఎక్కడా పెట్టలేదన్నారు. హోదా కంటే ప్యాకేజీ తోనే ఎక్కువ నిధులు వస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments