ఏపీలో డ్రై రన్ ప్రక్రియ విజ‌య‌వంతం: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (20:23 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ విజ‌య‌వంత‌మైంద‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోని 13 జిల్లాల్లో శనివారం డ్రై రన్ నిర్వహించామన్నారు.13 జిల్లాలు, 39 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరిగిందని చెప్పారు.

ఒక్కో కేంద్రంలో 25 మంది చొప్పున హెల్త్ కేర్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ వేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 975 మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. వీరిలో 954 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించగా, 21 మందికి వివిధ సమస్యల కారణంగా వ్యాక్సినేషన్ చేయలేదని పేర్కొన్నారు.

మొత్తం 39 కేంద్రాలలో వాక్సిన్ వినియోగానంతర ప్రభావానికి సంబంధించి 32 మైనర్,  26 మేజర్ సమస్యలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. వీటిని వైద్య నిపుణులు పరిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments