Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వస్తే.. మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం..

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (15:05 IST)
తన కుమారుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన వైకాపా బహిష్కత ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తే తామంతా సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ప్రకటించారు. 
 
తన కారు మాజీ డ్రైవరైన సుబ్రహ్మణ్యం వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి.. మృతదేహాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటి వద్ద పడేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. 
 
ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. అదేసమయంలో ఆయన బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. 
 
ఈ క్రమంలో సోమవారం కోర్టు విచారణకు తన కుటుంబ సభ్యులతో కలిసి మృతుని నూకరత్నం హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడిని పొట్టనబెట్టుకున్న హంతకుడు అనంతబాబుకు బెయిల్ ఇస్తే తామంతా సామూహిక అత్యాచారం చేసుకుంటామని ప్రకటించారు. 
 
ఆయన బయటకు వస్తే అధికార పార్టీ అండతో సాక్ష్యాధారాలను తారుమారు చేయడమేకాకుండా మాఫీ చేసే అవకాశం కూడా ఉందన్నారు. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ బాధిత కుటుంబం తరపున పిటిషన్ వేయగా దాన్ని కోర్టు స్వీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments