Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక మృతిపై విచారణ నివేదిక సమర్పించండి: విశాఖ సీపీ కి ఏపీ మహిళా కమిషన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:09 IST)
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై ఏపీ మహిళా కమిషన్ దృష్టి సారించింది. బాలిక మృతికి సంబంధించిన కారణాలపై విచారణ నివేదిక కోరుతూ విశాఖ పోలీసు కమిషనర్ కు లేఖ రాసింది.

పావని మృతి సంఘటన రోజే ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. కమిషన్ సభ్యురాలు సైతం ఘటనాస్థలికి వెళ్ళి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు వెల్లడించిన సమాచారం... అనంతరం బాలిక మృతిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఈ విషయంపై మరోమారు స్పందించారు.   

బాలిక మృతి ఆత్మహత్యనా.. హత్యనా అనే విషయంలో వాస్తవాలను నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments