Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక మృతిపై విచారణ నివేదిక సమర్పించండి: విశాఖ సీపీ కి ఏపీ మహిళా కమిషన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:09 IST)
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై ఏపీ మహిళా కమిషన్ దృష్టి సారించింది. బాలిక మృతికి సంబంధించిన కారణాలపై విచారణ నివేదిక కోరుతూ విశాఖ పోలీసు కమిషనర్ కు లేఖ రాసింది.

పావని మృతి సంఘటన రోజే ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. కమిషన్ సభ్యురాలు సైతం ఘటనాస్థలికి వెళ్ళి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు వెల్లడించిన సమాచారం... అనంతరం బాలిక మృతిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఈ విషయంపై మరోమారు స్పందించారు.   

బాలిక మృతి ఆత్మహత్యనా.. హత్యనా అనే విషయంలో వాస్తవాలను నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments