Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నేటిలో ఈత‌కు వెళ్ళి... పాపం! 12 ఏళ్ల బాలురు అయిదుగురి మృతి

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (10:45 IST)
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం చోటుచేసుకుంది. మున్నేరు వాగులో 5 గురు చిన్నారులు గల్లంత‌య్యారు. వారంతా మృతి చెందార‌ని స‌మాచారం అందింది. గ‌ల్లంత‌యిన విషయం తెలుసుకున్నఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతూ రెస్క్యూ టీంను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. కానీ, వారంతా ఈత రాక మునిగి మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. అందులో న‌లుగురు విద్యార్థుల మృత దేహాల‌ను వెలికితీశారు.
 
 
గల్లంతైన విద్యార్థులు చరణ్, బాలయేసు, స‌న్నీ, అజయ్, రాకేష్ గా గుర్తించారు. వీరంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నారు. ఇందులో న‌లుగురి మృత దేహాలు దొరికాయి. 
మున్నేరువాగులో ఈత కోసం వెళ్లిన చిన్నారులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ అంతా 12 సంవత్సరాల లోపు వారే. గల్లంతైన ఐదుగురు దుర్మరణం కావ‌డంతో గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. చిన్నారుల కోసం విస్తృతంగా గాలింపు జరిపిన ఎన్డిఆర్ఎఫ్, న‌లుగురి మృత‌దేహాల‌ను వెంట‌నే వెలికితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments