Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నేటిలో ఈత‌కు వెళ్ళి... పాపం! 12 ఏళ్ల బాలురు అయిదుగురి మృతి

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (10:45 IST)
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం చోటుచేసుకుంది. మున్నేరు వాగులో 5 గురు చిన్నారులు గల్లంత‌య్యారు. వారంతా మృతి చెందార‌ని స‌మాచారం అందింది. గ‌ల్లంత‌యిన విషయం తెలుసుకున్నఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతూ రెస్క్యూ టీంను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. కానీ, వారంతా ఈత రాక మునిగి మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. అందులో న‌లుగురు విద్యార్థుల మృత దేహాల‌ను వెలికితీశారు.
 
 
గల్లంతైన విద్యార్థులు చరణ్, బాలయేసు, స‌న్నీ, అజయ్, రాకేష్ గా గుర్తించారు. వీరంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నారు. ఇందులో న‌లుగురి మృత దేహాలు దొరికాయి. 
మున్నేరువాగులో ఈత కోసం వెళ్లిన చిన్నారులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ అంతా 12 సంవత్సరాల లోపు వారే. గల్లంతైన ఐదుగురు దుర్మరణం కావ‌డంతో గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. చిన్నారుల కోసం విస్తృతంగా గాలింపు జరిపిన ఎన్డిఆర్ఎఫ్, న‌లుగురి మృత‌దేహాల‌ను వెంట‌నే వెలికితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments