సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉగాది పండుగకు వెళ్లి రాత్రి తల్లితో కలిసి కాలేజీకి వచ్చిన కృష్ణవేణి.. కాలేజీ భవనం పై నుంచి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మంచిర్యాలకు సంబంధించిన కృష్ణవేణి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.