Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో భార్య కుమార్తెపై అత్యాచారం చేసిన మారుతండ్రి

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (11:08 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. రెండో భార్య కుమార్తెపై మారుతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి (45) ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
ఆమెకు మొదటి భర్తతో పుట్టిన కుమార్తె(13) నగరంలో ఓ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లిన బాలికపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయం బయటకు చెబితే మీ అమ్మతో పాటు నిన్నుకూడా చంపేస్తానని బెదిరించాడు. కానీ ఆ యువతి ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. 
 
ఈ విషయం ఇరుగుపొరుగువారి ద్వారా బాలల హక్కుల సంఘానికి తెలిసింది. దీంతో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments