Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నాటికి వైద్య, ఆరోగ్యశాఖలో సిబ్బంది నియమాకం: సీఎం

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (13:53 IST)
ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య కార్డుల జారీపై సీఎం సమీక్షించారు. జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

నాడు - నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణంపై చర్చించిన ఆయన.. రాష్ట్రాన్ని 5 జోన్లుగా మార్చి సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు.

3 ప్రాంతాల్లోనూ మెడికల్ వర్సిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్న సీఎం.. మే నాటికి వైద్య, ఆరోగ్యశాఖలో సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. 9 చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయన్న అధికారులు.. 4, 5 ఆస్పత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదన అమలు చేయవచ్చని ముఖ్యమంత్రికి తెలిపారు.

మూడో విడత కంటి వెలుగు ఈ నెల 17 నుంచి మూడోవిడత కంటివెలుగు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేయాలని అధికారుల అంచనా వేస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమాన్ని కర్నూలులో సీఎం ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్‌సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నారు. 
 
మధుమేహం, బీపీ, క్యాన్సర్, టీబీ, లెప్రసీకి ఏప్రిల్ 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 1.63 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. హైదరాబాద్‌ 72, చెన్నై 23, బెంగళూరులో 35 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కాగా మార్చి 15 నాటికి అందరికీ హెల్త్‌కార్డులు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. సదరం సెంటర్లను 52 నుంచి 167కు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments