Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు.. ఫినాయిల్ తాగిన క్లర్కు

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (15:32 IST)
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు తాళలోని ఆ కార్యాలయ క్లర్కు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం కలకలం సృష్టించిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ కార్యాలయంలో క్యాంపు క్లర్క్‌గా సంతోష్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన్ను జడ్పీ సీఈఓ నగేష్ గత రెండేళ్లుగా మానసికంగా వేధిస్తున్నాడు. పైగా పదోన్నతిలో సంతోష్‌కు అన్యాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
దీంతో సంతోష్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన బాధను వెళ్లబోసుకుంటూనే ఉన్నట్టుండి ఫినాయిల్ సేవించాడు. ఈ హఠాత్పరిణామంతో బిత్తర పోయిన ఇతర సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత సంతోష్‌ను బలవంతంగా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments