Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామంలో బట్టలు ఉతకబోమని దండోరా వేసిన రజకులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ వలంటీర్ల పోస్టుల నియామకం ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఓ వలంటీర్ చొప్పున నియమించనున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి 100 గృహాలకు ఒక వలంటీర్‌ను ఎంపిక చేయనున్నారు. 
 
అయితే, ఈ వలంటీర్ పోస్టుల ఎంపిక గ్రామంలో చిచ్చుపెట్టింది. దీంతో ఆ గ్రామానికి చెందిన రజకులు మాసిన బట్టలు ఉతకరాదని తీర్మానించారు. ఈ విషయాన్ని చాటింపు వేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీవాడ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామంలో గ్రామ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో తాము ఉంటున్న కాలనీలో తమ కులస్తుడికికాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామంలోని రజకులంతా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ కులస్తుడికికాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టు ఇచ్చినందుకు శనివారం నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాట గ్రామంలో దండోరా వేయించారు. దీనిపై గ్రామ పెద్దలు లేదా మండల అధికారులు నోరుమెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments