Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామంలో బట్టలు ఉతకబోమని దండోరా వేసిన రజకులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ వలంటీర్ల పోస్టుల నియామకం ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఓ వలంటీర్ చొప్పున నియమించనున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి 100 గృహాలకు ఒక వలంటీర్‌ను ఎంపిక చేయనున్నారు. 
 
అయితే, ఈ వలంటీర్ పోస్టుల ఎంపిక గ్రామంలో చిచ్చుపెట్టింది. దీంతో ఆ గ్రామానికి చెందిన రజకులు మాసిన బట్టలు ఉతకరాదని తీర్మానించారు. ఈ విషయాన్ని చాటింపు వేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీవాడ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామంలో గ్రామ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో తాము ఉంటున్న కాలనీలో తమ కులస్తుడికికాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామంలోని రజకులంతా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ కులస్తుడికికాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టు ఇచ్చినందుకు శనివారం నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాట గ్రామంలో దండోరా వేయించారు. దీనిపై గ్రామ పెద్దలు లేదా మండల అధికారులు నోరుమెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments