Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగలకు ప్రత్యేక రైళ్లు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:16 IST)
పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా రోజుల్లో అదనపు సర్వీసులతో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో... దక్షిణ మధ్య రైల్వే 178 ప్రత్యేక రైళ్లను నడునున్నట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు. తిరుపతి-నాగర్‌సోల్‌-తిరుపతి మధ్య 26 వీక్లీ రైళ్లు నడుపుతామన్నారు.

వీటిని జనవరి 3,10,17,24,31 ఫిబ్రవరి 7,14,21,28 మార్చి 6,13,20, 27 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. నాగర్ సోల్-తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను జనవరి 4,11,18,25 ఫిబ్రవరి 1,8,15,22,29 మార్చి 7,14,21,28 తేదీల్లో నడుపుతామని తెలిపారు. 
 
నాందేడ్-తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను... జనవరి 7,14,21,28, ఫిబ్రవరి 4,11,18,25 మార్చి 3,10,17,24,31 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. తిరుపతి-నాందేడ్ మధ్య జనవరిలో 8,15,22,29, ఫిబ్రవరి 5,12,19,26 మార్చి 4,11,18, 25, ఏప్రిల్ 1న కూడా ఈ రైళ్లను నడుపుతున్నారు. 
 
నర్సాపూర్-హైదరాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-మచిలీపట్నం-కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నర్సాపూర్-హైదరాబాద్ మధ్య 3, హైదరాబాద్-విజయవాడ మధ్య 4, మచిలీపట్నం-సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య 7, కాచిగూడ-కాకినాడటౌన్-కాచిగూడ మధ్య 7 ప్రత్యేక సర్వీసుల సేవలు అందించనున్నట్లు తెలిపారు. జనసాధరణ్, 10 సువిధ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాతాలకు నడపనున్నారు.

నర్సాపూర్-హైదరాబాద్ మధ్య ఒక సువిధ, సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ఒక సువిధ సర్వీసు, కాచిగూడ-కాకినాడటౌన్-కాచిగూడ మధ్య రెండు సువిధ సర్వీసులు, విజయవాడ-విజయనగరం మధ్య ఆరు జనసాధరణ్ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. తిరుపతి-కరీంనగర్ మధ్య 78 ప్రత్యేక సర్వీసులను వారంలో మూడు రోజులపాటు నడపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments