Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశద‌ర్శ‌నం టిక్కెట్ల కోటా విడుద‌ల

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (19:38 IST)
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జులై నెల‌కు సంబంధించిన రూ.300 ప్ర‌త్యేక ‌ప్ర‌వేశద‌ర్శ‌న టిక్కెట్ల కోటాను సోమ‌వారం టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా జులై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేస్తారు.

తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులు ఒకరోజు ముందు ఈ టోకెన్లు పొంద‌వ‌చ్చు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు. 
 
జూలైలో శ్రీ‌వారి ఆల‌యంలో ప‌ర్వ‌దినాలు ఇవే...
* 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, జూలై 16న ఆణివ‌ర ఆస్థానం.
* 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర‌, తిరుమ‌ల శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు.
* 28న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.
* 30 నుండి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments