Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాపణ చెప్తా: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (08:19 IST)
ఉపాధి కల్పన లక్ష్యంగా అమరావతిని నిర్మించాలనుకున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ‘ప్రజా రాజధాని అమరావతి’పై టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

హైదరాబాద్‌ కంటే గొప్పగా అమరావతిని నిర్మించుకునే అవకాశం మనకు ఉందన్నారు. ఈ ఆరు నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉండేవారన్నారు. రాజధాని ప్రాంతంలో 5,024 పేదల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. ఒకసారి రోడ్డు వేసిన తర్వాత మళ్లిd ఎప్పుడూ తవ్వాల్సిన అవసరం లేకుండా వేశామన్నారు.

రాజధానిని ముందుకు తీసుకెళ్లకపోతే యువత తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాజధాని ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అన్ని రాష్ట్రాలకు రాజధాని అనేది ప్రధాన ఆదాయ వనరు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

రాజధానికి 53,748 ఎకరాలు భూమి సమకూరిందన్నారు. భవిష్యత్‌ అభివృద్ధి కోసం 5వేల ఎకరాలు కేటాయించామని, 8,039 ఎకరాలు రిజర్వు పెట్టుకున్నామని పేర్కొన్నారు. అమరావతికి 50వేల మందికి ఇళ్లు కట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములివ్వడం ఇదే ప్రథమమన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కేసు స్టడీగా పెట్టుకున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. అమరావతి బాండ్లు జారీ చేస్తే 2 గంటల్లో రూ.2వేల కోట్లు వచ్చాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments