Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినను తిట్టిన తండ్రి.... ఆగ్రహంతో చంపేసిన కొడుకు...

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:31 IST)
క్షణికావేశంలో కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. కట్టుకున్న భార్య అయినా, కన్న తండ్రి అయినా సరే ఆవేశంలో హత్యలు చేసేస్తుంటారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో జరిగింది. తన వదినను కొట్టాడన్న కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు తన తండ్రిని గోడకేసి బాది అతి దారుణంగా చంపేశాడు. 
 
వి.కోట మండల పరిధిలోని పాముగాని పల్లె పంచాయతీ కొత్తచిన్నేపల్లి గ్రామానికి చెందిన సల్లా పూరెప్పకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అంజప్ప సంరక్షణలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు వెంకటరమణ జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. అంజప్ప భార్య షబానా ఇంట్లో మటన్ కర్రీ చేసింది. సల్లా వూరెప్ప తనకు మాంసం కూర పెట్టలేదని కోడలు షబానాతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న వెంకటరమణ వదిననే తిడతావా అంటూ తండ్రి సల్లాపూరెడ్డిని గోడకేసి కొట్టి హతమార్చాడు. 
 
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments