Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినను తిట్టిన తండ్రి.... ఆగ్రహంతో చంపేసిన కొడుకు...

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:31 IST)
క్షణికావేశంలో కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. కట్టుకున్న భార్య అయినా, కన్న తండ్రి అయినా సరే ఆవేశంలో హత్యలు చేసేస్తుంటారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో జరిగింది. తన వదినను కొట్టాడన్న కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు తన తండ్రిని గోడకేసి బాది అతి దారుణంగా చంపేశాడు. 
 
వి.కోట మండల పరిధిలోని పాముగాని పల్లె పంచాయతీ కొత్తచిన్నేపల్లి గ్రామానికి చెందిన సల్లా పూరెప్పకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అంజప్ప సంరక్షణలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు వెంకటరమణ జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. అంజప్ప భార్య షబానా ఇంట్లో మటన్ కర్రీ చేసింది. సల్లా వూరెప్ప తనకు మాంసం కూర పెట్టలేదని కోడలు షబానాతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న వెంకటరమణ వదిననే తిడతావా అంటూ తండ్రి సల్లాపూరెడ్డిని గోడకేసి కొట్టి హతమార్చాడు. 
 
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments