Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రెజిల్: టూత్ బ్రష్‌లను పొడుచుకున్నారు.. 15 మంది ఖైదీలు మృతి

బ్రెజిల్: టూత్ బ్రష్‌లను పొడుచుకున్నారు.. 15 మంది ఖైదీలు మృతి
, సోమవారం, 27 మే 2019 (15:16 IST)
బ్రెజిల్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. బ్రెజిల్ లోని అమెజొనాస్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి చేతికి అందినవాటితో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 15 మంది ఖైదీలు మృతి చెందారు. టూత్ బ్రష్షులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
టూత్ బ్రష్‌లతో పొడుచుకోవడం.. గొంతును నులిమేయడం చేశారు. దీంతో జైలు అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెజిల్‌లోని జైళ్లు.. ప్రపంచంలోనే మూడో వరుసలో అత్యధిక ఖైదీలను కలిగివుంది. జైళ్లల్లో మగ్గుతున్న వారి సంఖ్య జూన్ 2016 నాటికి 726,712 మందికి చేరిందని అధికారులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు అది ఉంది.. నేను చూశా.. నేను విన్నా.. నేనున్నా..