Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:45 IST)
మేము సాఫ్ట్‌గా ఉన్నాం కదా అని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే చూస్తూ ఊరుకోము అని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజెపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు సోము వీర్రాజు.
 
చిత్తూరు జిల్లా రేణిగుంటలో జనసేన పార్టీ నాయకురాలు నగరం వినూతను పరామర్శించారు సోము వీర్రాజు. వినూత ఇంటిపై వైసిపి కార్యకర్త శివ దాడి చేసి కారు అద్దాలతో పాటు ఇంటిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో సోము వీర్రాజు రేణిగుంటకు చేరుకున్నారు.
 
ఎపిలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తాబేదారులుగా మారిపోయారని విమర్సించారు. జనసేన పార్టీ నాయకురాలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments