Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తులపై మేమిద్దరం మంచి క్లారిటీతోనే ఉన్నాం : సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులపై ఏపీ శాఖ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. పొత్తుల అంశంలో తాను, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఓ పక్కా క్లారిటీతోనే ఉన్నామని చెప్పారు. 
 
కాగా, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో తన ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్  ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ, బీజేపీతో పొత్తులే ఉన్నాం అంటూ ఓ సందిగ్ధత వ్యక్తం చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖాయమనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుపై పవన్ అస్పష్టంగా వ్యాఖ్యానించగా, వీటిపై సోము వీర్రాజు స్పందించారు. పొత్తులపై తామిద్దరం ఓ క్లారిటీతోనే ఉన్నామన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదన్నారు. 
 
తొలుత తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని వ్యాఖ్యానించి సోము వీర్రాజు.. ఆ తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యల అనంతరం తన మాటలను ఆయన సవరించుకోవడం గమనార్హం. కాగా, ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య గత కొంతకాలంగా ఉమ్మడి కార్యాచరణ అంటూ ఏదీ లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా లేదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments