Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (17:14 IST)
కర్నూలు జిల్లాలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకంగా జరిగింది. ఈ శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే మీకు చలనం లేదా అంటూ సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నించారు. 
 
అసాంఘిక శక్తులను పెంచి పోషించి రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం మీరు వహిస్తున్న మౌనం మత కల్లోలాలకు దారితీస్తుంటే మీకు కళ్లు కనిపించడం లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలం దేవాస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. 
 
ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో తానే స్వయంగా పర్యటిస్తానని ప్రజా క్షేత్రంలో మీ నిరంకుస వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments