Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (17:14 IST)
కర్నూలు జిల్లాలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకంగా జరిగింది. ఈ శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే మీకు చలనం లేదా అంటూ సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నించారు. 
 
అసాంఘిక శక్తులను పెంచి పోషించి రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం మీరు వహిస్తున్న మౌనం మత కల్లోలాలకు దారితీస్తుంటే మీకు కళ్లు కనిపించడం లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలం దేవాస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. 
 
ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో తానే స్వయంగా పర్యటిస్తానని ప్రజా క్షేత్రంలో మీ నిరంకుస వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments