Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుసూదన శాస్త్రికి నివాళి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:53 IST)
నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతి చెందారు. ఎంతో పేరొందిన డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి భౌతికకాయానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులర్పించారు. డాక్ట‌ర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
అంకిత భావంతో సేవలు అందించడం ద్వారా డాక్టర్ అంటే మధుసూదన శాస్త్రినే అనే ప్రత్యేక గుర్తింపు పొందార‌ని సోమిరెడ్డి పేర్కొన్నారు.న ఆయ‌న నెల్లూర న‌గ‌రానికే కాదు...చుట్టుప‌క్క‌ల ప‌లు గ్రామాల వారికి గొప్ప వైద్యుడ‌ని, అతి త‌క్కువ ఫీజుతో అంద‌రికీ ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి వైద్య వృత్తిపరమైన బాధ్యతల నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయుల‌ని, త‌మ‌ తండ్రి గారి నుంచి, త‌న వరకు ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉంద‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మధుసూదన శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. 

నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతికి న‌గ‌రంలోని ప‌లువురు సంతాపం తెలిపారు. భారీగా జ‌నం ఆయ‌న అంతిమ యాత్ర‌లో పాల్గొని నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments