Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులపై సీఎం జగన్ విఫల ప్రయోగం : సోమిరెడ్డి

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (08:52 IST)
నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రయోగం విఫలమైందని ప్రజలకు బాగా అర్థమైందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ, ప్రజలను మభ్యపెట్టడానికి వైకాపా నేతలు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారన్నారు. 
 
ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేత విజయసాయి రెడ్డి బృందం ఉత్తరాంధ్రను తమ కబంధహస్తాల్లో పెట్టుకొని అక్కడి సంస్కృతిని నాశనం చేస్తుంటే, వారిని ఎదుర్కోవడం చేతగాక ధర్మాన వంటి దద్దమ్మ మంత్రులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను అవాకులు చెవాకులు పేలడం సరికాదన్నారు. 
 
నిజం చెప్పాలంటే అనంతపురం నుంచి అమరావతికి రావాలంటే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందన్నారు. కానీ, విజయవాడ నుంచి మరో ఆరు లేదా ఏడు గంటలు ప్రయాణిస్తేగానీ వైజాగ్ రాదని గుర్తుశారు. అమరావతి అనేది నవ్యాంధ్రకు నడిబొడ్డున ఉన్న రాజధాని అని దాన్ని వదిలిపెట్టి.. ఒక మూలన పెట్టాలని ఆనడంలో విజ్ఞత లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments