Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:28 IST)
ఇటీవల కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న యువతి... తన ప్రియుడుతో కలిసి టెక్కీ భర్తను హత్య చేసింది. దీనిపై స్థానిక పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు గుట్టు బహిర్గతమైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రైల్వే కోడూరుకు చెందిన షబ్నా అనే యువతికి అబ్దుల్ ఖాదర్ అనే టెక్కీతో పెద్దలు పెళ్లి చేశారు. అయితే, షబ్నాకు అప్పటికే ప్రిన్స్ అనే ప్రియుడుతో శారీరక సంబంధం కూడా ఉంది. దీంతో ఖాదర్‌తో పెళ్లి ఇష్టంలేదు. ఈ విషయాన్ని తన ప్రియుడు ప్రిన్స్‌కు చెప్పింది. వారిద్దరూ కలిసి కిరాయి ముఠా సభ్యులతో కలిసి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. 
 
ఈ కేసులో భార్య షహ్నాతో పాటు... ప్రిన్స్, అతనికి సహకరించిన దీనదయాళ్ బాబు, సెల్వందేవ్‌ అనే కిరాయి ముఠా సభ్యులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఖాదర్‌తో పెళ్లి తనకు ఏమాత్రం ఇష్టంలేదనీ, ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు.. అత్తమామలకు చెప్పినా వారు వినిపించుకోకుండా తనకు అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేశారని అందుకే హత్య చేయించినట్టు నిందితురాలు షబ్నా వాంగ్మూలం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేస్తే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments