Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై తాతగారి ఊరెళుతున్న టెక్కీ.. కొట్టి చంపేసిన దుండగులు... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (11:39 IST)
ఏపీలోని విజయనగరం జిల్లా తెర్లాం మండలం, నెమలాంలో టెక్కీ దారుణ హత్యకు గురయ్యాడు. బైకుపై తన తాతగారి ఊరుకు వెళుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెమలాం గ్రామానికి చెందిన కొనారి ప్రసాద్ (28) అనే యువకుడు టెక్కీగా పని చేస్తున్నాడు. 
 
సోమవారం రాత్రి తన బైకుపై తాతగారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
 
మృతుడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? ఈ ఘటనకు అదే కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments