Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ తెచ్చిన తంటా.. ఆరగంట ఆగిన వందే భారత్ రైలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (13:25 IST)
కొందరు అకతాయిలు చేసే పనులు వినేందుకు నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ, ఆందోళనకరంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పెను ముప్పుకు దారితీస్తుంటాయి. తాజాగా పొగరాయుడు చేసిన పనికి వందే భారత్ రైలు అరగంట పాటు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది బుధవారం సాయంత్రం జరిగింది. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు అరగంట నిలిపివేశారు. 
 
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైలులో నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైలులోని ఓ బోగీ నుంచి పొగలు వచ్చాయి. దీన్ని రైల్వే సిబ్బంది గుర్తించి రైలును ఆపివేసి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత పొగలు వచ్చిన బోగీలో సిబ్బంది తనికీ చేశారు. 
 
అయితే, ఆ బోగీలో కాల్చిపడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్ సామాగ్రికి అంటుకోవడంతో పొగ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఈ ఘటనకు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కారకుడిగా గుర్తిచి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బోగీలో చెలరేగిన మంటలను పూర్తిగా ఆర్పివేసిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. ఈ కారణంగా ఓ అరగంట పాటు రైలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments