Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమ్‌డెసివిర్‌ ఖాళీ సీసాల్లో స్లైన్‌ నీళ్లు... ముగ్గురి అరెస్టు

Webdunia
సోమవారం, 24 మే 2021 (11:06 IST)
రెమ్‌డిసివర్ ఖాళీ సీసాల్లో స్లైన్ నీళ్లు పోసి విక్రయిస్తున్న ముగ్గురి సభ్యుల ముఠాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ దుర్గాపురానికి చెందిన కిశోర్‌ (39) అనే వ్యక్తి సూర్యారావుపేటలోని ఒక ప్రైవేటు దవాఖానలో మత్తుమందు టెక్నీషిన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ రోగులకు వినియోగించిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల ఖాళీసీసాలను సేకరించి.. వాటిలో స్లైన వాటర్‌ నింపి నకిలీవి తయారుచేశాడు. 
 
వాటిని డోర్నకల్‌ రోడ్డులోని కోన మెడికల్స్‌ నిర్వాహకుడు కటికపూడి సంపత్‌కుమార్‌, గోవిందరాజులు నాయుడు వీధిలోని జయశ్రీ మెడికల్‌ నిర్వాహకుడు పాలడుగుల వెంకట్‌ గిరీశ్‌కు విక్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ఓ కరోనా బాధితుడి బంధువులకు వీరు ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.20 వేలకు అమ్మారు. గుంటూరు వైద్యులు వాటిని నకిలీవిగా గుర్తించి.. బాధితుడి బంధువులకు విషయం చెప్పారు. వారి సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని ముగ్గురినీ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments