కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లు వున్నాయని చెప్తే.. 100 నిమిషాల్లో? శివాజీ

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:35 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో కోట్లు ఉన్నాయని ఒకవేళ తాను చెబితే.. వంద నిమిషాల్లో అక్కడకు వెళ్లి.. వారి ఫామ్ హౌస్‌లో సోదాలు చేస్తారా అని హీరో శివాజీ అన్నారు. ఒక్క కేసీఆరే కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్ రెడ్డి ఇంట్లోనే సోదాలు చేయాలన్నారు. ఈ పరిస్థితి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదు. 
 
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సోదాలు లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దీనితో సంబంధం లేదు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని శివాజీ చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఐటీ, జీఎస్టీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో డబ్బులు తీసుకెళ్తున్నా... సీజ్ చేస్తున్నారని హీరో శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఐటీ, జీఎస్టీ దాడులతో బెంబేలెత్తిస్తున్నారని శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడులు తమ పరిధిలో లేవని, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని ద్వివేదీ తనకు చెప్పారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments