Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.వివేకా హత్య : సిట్ అదుపులో వైఎస్.జగన్ ముఖ్య అనుచరుడు

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:18 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మరోముఖ్య అనుచరుడు నాగప్ప, కుమారుడు శివల వద్ద సిట్ బృందం ప్రశ్నిస్తోంది.
 
ఈనెల 15వ తేదీన తన ఇంట్లోని బాత్రూమ్‌లో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయంతెల్సిందే. ఈ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ కేసును విచారించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. 
 
ఈ బృందం అనేక మందిని అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో విచారిస్తోంది. ముఖ్యంగా, హత్యకు గల కారణాలను ఆరా తీస్తోంది. అనుచరులే ఆయన్ని చంపేశారా? ఆస్తి తగాదాలే ముఖ్య కారణమా? వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. 
 
మరోవైపు, ఈ హత్య వెనుక పరమేశ్వర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులుకాగా, పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని వివిధ చోట్ల ఉన్న రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments