Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం ఛాంపియన్ చెల్లిని తోసేశాడు... చనిపోయింది... గుంటూరులో...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (17:35 IST)
సెల్ ఫోన్లతో ఉపయోగాలు ఎన్ని వున్నాయో నష్టాలు కూడా అన్నే వున్నాయి. ఈ సెల్ ఫోన్ల మాయలో పడి చాలామంది టీనేజ్ పిల్లలు తాము ఏం చేస్తున్నామో పట్టించుకోవడంలేదు. మరికొందరైతే సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవికాకుండా సెల్ ఫోన్ల కోసం పిల్లల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు పోయాయి.
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని చినకొండాయపాలేనికి చెందిన 13 ఏళ్ల గోరంట్ల విజయలక్ష్మి ఏడో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో తల్లి, అన్నయ్యలతో కలిసి అమ్మమ్మగారి ఊరు ఉప్పలపాడుకు వచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య మంగళవారం నాడు స్మార్ట్ ఫోన్ వ్యవహారంలో తోపులాట జరిగింది. తనకు ఫోన్ చూపించాలంటూ విజయలక్ష్మి అన్నయ్యను అడిగింది. 
 
అందుకు అతడు ససేమిరా అనడమే కాకుండా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న చెల్లెల్ని బలంగా తోసేశాడు. అంతే... ఆమె తల నేలకి బలంగా తగిలింది. దీంతో ఆమె పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విజయలక్ష్మి క్రీడల్లో ఛాంపియన్‌గా పలు బహుమతులు అందుకుంది. కేవలం స్మార్ట్ ఫోన్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇంటిల్లపాది శోకంలో మునిగిపోయారు.‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments