Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం హుండీలో భారీ మొత్తం.. వంద కోట్ల చెక్కు.. ఏం జరిగిందంటే?

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (13:56 IST)
సింహాచలం హుండీలో భారీ మొత్తానికి సంబంధించిన చెక్కు కనిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వంద కోట్ల రూపాయలు రావడంతో ఉత్కంఠ నెలకొంద. అయితే దేవస్థానం అధికారులు ఏదో తప్పుగా రాసి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ఈ చెక్కును వెంటనే బ్యాంకుకు పంపారు. దాతను గుర్తించడానికి ఆలయం ఇప్పుడు బ్యాంకుకు లేఖ రాయాలని పరిశీలిస్తోంది. ఈ చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొనే అవకాశం ఉంది.
 
విశాఖ సమీపంలోని సింహాచలం కొండపై కొలువైన సింహాచలం అప్పన్నస్వామి ఉత్తరాంద్ర వాసులకు ఆరాధ్య దైవం. వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు స్వామి వారి హుండీలో ఓ చెక్ వేశాడు. బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే పేరుతో వేసిన ఆ చెక్ మీద వందకోట్లు రాసి ఉంది. అయితే ఈ చెక్ చూసి షాకైన అప్పన్న ఆలయ నిర్వాహకులు షాకయ్యారు. 
 
సదరు భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నాయంటూ బ్యాంక్ అధికారులు చెప్పడంతో సింహాచలం ఆలయ అధికారులు కంగుతున్నారు. మరోవైపు భక్తుడు రాధాకృష్ణ అడ్రస్ వివరాలు కోరుతూ బ్యాంకుకు లేఖ రాయాలని దేవస్థానం వర్గాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments