Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రోజులుగా ఇంట్లోనే శవం.. దుర్వాసన.. అయినా పక్కనే కూర్చుని భోజనం..?

జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట రహదారిలోని మేఘన టవర్స్‌లో టి.అరుణజ్యోతి(41) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మరణించి ఐదురోజులు వుంటుందని.. ఇంటి

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (11:58 IST)
జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట రహదారిలోని మేఘన టవర్స్‌లో టి.అరుణజ్యోతి(41) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మరణించి ఐదురోజులు వుంటుందని.. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా ఇంట్లోనే అరుణ జ్యోతి మృతదేహాన్ని కనుగొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాల నేపథ్యంలో జీలుగుమిల్లికి చెందిన టి.మంజులాదేవి (70), ఆమె కుమారుడు టి.రవిచంద్ర(39), కుమార్తె టి.అరుణజ్యోతి(41)లు జంగారెడ్డిగూడెంలోని మేఘన టవర్స్‌ మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. గత కొంత కాలంగా తమ ఆస్తులకు సంబంధించి తగాదాలు జరుగుతుండటంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అరుణ జ్యోతి ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మృతి చెందిన అరుణజ్యోతి అయిదు రోజులుగా ఇంట్లోనే శవంగా పడి ఉంది. తల్లి, కుమారుడికి కూడా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతో శవం పక్కనే కూర్చుని రవిచంద్ర భోజనం చేస్తున్నాడు. తమ కుమార్తె చనిపోలేదని, నిద్రపోతుందని పోలీసులపై మండిపడ్డారు. వైద్యులు వచ్చి ధ్రువీకరిస్తే తప్ప నమ్మం అంటూ సోదరుడు రవిచంద్ర అనడంతో పోలీసులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి బలవంతంగా శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments