Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిర్యానీ ఎంచక్కా లాగించేశారు.. డబ్బులడిగితే.. తుపాకీతో..?

హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుం

బిర్యానీ ఎంచక్కా లాగించేశారు.. డబ్బులడిగితే.. తుపాకీతో..?
, మంగళవారం, 5 జూన్ 2018 (13:42 IST)
హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌‍లో బిర్యానీ లాగించిన కస్టమర్ల వద్ద ప్లేట్‌ బిర్యానీ ఖరీదు రూ.190 ఇవ్వాలని హోటల్‌ యజమాని అడిగాడు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తింది. దీంతో నలుగురు కస్టమర్లలో ఒకరు తుపాకీతో యజమాని సంజయ్‌ని కాల్చి పరారైనారు. ఈ ఘటనలో గాయపడిన సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే టిక్కెట్ కలెక్టర్‌ కాదు.. కామాంధుడు.. ఆరేళ్ళ చిన్నారిపై...