Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైలు నుంచి పడిన ప్రేమికులు.. మాట్లాడుతూ..?

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:41 IST)
Train
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన కారుణ్య అనే 24 ఏళ్ల మహిళ కదులుతున్న రైలు నుంచి పడి తీవ్ర గాయాలపాలైన ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. 
 
చెంగల్‌పట్టులో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న కారుణ్య తన స్నేహితులతో కలిసి కేరళకు వెళ్తోంది. తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి ముందు కారుణ్య తన ప్రియుడు రాజేష్‌తో మాట్లాడుతూవుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. 
 
రైలు కదలడం ప్రారంభించగానే, ఇద్దరూ దానిని ఎక్కేందుకు పరుగెత్తారు, కానీ కారుణ్య కాలుజారిపోయింది. మెట్లపై నుంచి దొర్లిపోయింది. కదులుతున్న రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాజేష్ కూడా రైలు నుంచి కింద పడ్డాడు.
 
తోటి ప్రయాణీకులు వారిని కాపాడారు. రాజేష్‌, కారుణ్యను పట్టాల కిందకు వెళ్లకుండా కాపాడారు.  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments