పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని... ఎలా జరిగిందో తెలియదంటోంది...

సమాజం ఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ కవులు, రచయితలు చెబుతుంటారు. సమాజం మన చేయి దాటి పోతోంది. వావివరుసలు మరిచిపోతున్నారు. మనిషిన్న విషయాన్ని అసలే మరిచిపోతున్నారు. సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలా ఎన్నో విధాలుగా

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (19:34 IST)
సమాజం ఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ కవులు, రచయితలు చెబుతుంటారు. సమాజం మన చేయి దాటి పోతోంది. వావివరుసలు మరిచిపోతున్నారు. మనిషిన్న విషయాన్ని అసలే మరిచిపోతున్నారు. సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చెబుతున్నారు కవులు, రచయితలు.
 
అలాంటి సంఘటనల్లో ఒకటి మీరు చదవబోతున్నది. తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నడుపబడుతున్న పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో ఒక విద్యార్థిని పెళ్ళి కాకుండానే తల్లయ్యింది. కడుపు నొప్పితో డిసెంబర్ 31వ తేదీన టిటిడి సెంట్రల్ ఆసుపత్రిలో సహచర విద్యార్థినులు చేర్పించారు. అయితే ఆసుపత్రిలో ఆ విద్యార్థిని పురిటి నొప్పుతో బాధపడుతోందని చెప్పారు. దీంతో హాస్టల్ సిబ్బందితో పాటు సహచర విద్యార్థులు ఆశ్చర్యపోయారు. పద్మావతి మహిళా కళాశాలలో చదువుకునే విద్యార్థినులను బయటకు పంపించరు. హాస్టల్‌లో ఎప్పుడూ క్రమశిక్షణగానే ఉండాలి. అలాంటి పరిస్థితి ఉన్న ప్రాంతంలో ఈ విద్యార్థిని ఎవరిని కలిసింది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 
అంతేకాదు జనవరి 1వ తేదీన ఒక నర్సింగ్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు హడావిడిగా ఆసుపత్రికి వచ్చారు. తమ బిడ్డను నిలదీశారు. ఎవరో నాకు తెలియదు.. తనకు ప్రియుడెవ్వరు లేదు అంటూ విద్యార్థిని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు హతాశయులయ్యారు. తమ బిడ్డ అమాయకత్వమా లేకుంటే భయపడి చెప్పడంలేదా అర్థం కాక తల్లిదండ్రులు సతమతపడుతున్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పద్మావతి డిగ్రీ కళాశాలకు చెందిన హాస్టల్ వార్డెన్‌తో పాటు డిప్యూటీ వార్డెన్లకు మెమోలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెమోలు జారీ చేశారు. ఆ విద్యార్థిని తల్లి ఎలా అయ్యిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments