బీజేపీకి షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బీహార్'​ తీర్మానం

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:47 IST)
ఎన్​ఆర్​సీ విషయంలో బీజేపీకి అనూహ్య పరిణామం ఎదురైంది. ఎన్​డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రం​లోనే జాతీయ పౌర పట్టికను వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసింది.

ఎన్​పీఆర్​ అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బీహార్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక-ఎన్​ఆర్​సీ అమలును వ్యతిరేకిస్తూ బీహార్​ శాసనసభ తీర్మానం చేసింది.

త్వరలో అమలు కావాల్సిన జాతీయ జనాభా పట్టిక-ఎన్​పీఆర్​ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్​పీఆర్​ను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన పద్ధతిలో కాక యూపీఏ హయాం(2010) నాటి విధానంలో స్వల్ప మార్పులతో రూపొందించాలని తీర్మానించింది.

బీజేపీకి ఎదురుదెబ్బ! దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై కొంతకాలంగా తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల శాసనసభలు ఇప్పటికే ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి.

అయితే... ఎన్​డీఏ(జేడీయూ-బీజేపీ) అధికారంలో ఉన్న బీహార్​లోనే ఇలాంటి తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్​లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్​ఆర్​సీ విషయంలో నితీశ్​ ప్రభుత్వం మిత్రపక్షం(బీజేపీ) వైఖరికి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఎన్​పీఆర్​ విషయంలోనూ స్వయంగా నితీశ్​ కుమార్​ అభ్యంతరాలు లేవనెత్తడం గమనార్హం.

కొత్త ఎన్​పీఆర్​ దరఖాస్తుల్లోని వివాదాస్పద నిబంధనల్ని తొలిగించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా చెప్పారు నితీశ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments