Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తరలింపుపై ఏపీ సర్కారు, ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి : కేంద్రం

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వుందని కేంద్రం వ్యాఖ్యానించింది. హైకోర్టు తరలింపు అంశం తమ చేతుల్లో లేదని చెప్పారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలనే విషయంలో నిర్ణయాన్ని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వుందని కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఏపీ హైకోర్టును తరలించే అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని చెప్పారు. 
 
ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందన్నారు. అయితే, అక్కడ నుంచి కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారని, అయితే, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. 
 
అమరావతిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ సీఆర్డీఏను ఆదేశించిందని గుర్తుచేశారు. అదేసమయంలో హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో ఏపీ హైకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సివుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments