Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ప్యాకెట్ తెస్తానని వెళ్లి ప్రియుడితో కలిసి, తెల్లారగానే చావు కబురు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (11:25 IST)
పాల ప్యాకెట్ తెస్తానని చెప్పి వెళ్లిన యువతి అర్థరాత్రి వరకూ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే తెల్లవారేసరికి తమ కుమార్తె చనిపోయిందంటూ సమాచారం వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ చదువుతున్న యువకుడు ఒంగోలు లోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందును ప్రేమించాడు. ఇద్దరూ ఒకరికొకరు విడిచిపెట్టలేని స్థితికి వచ్చేశారు. ఐతే ఈ వ్యవహారం పెద్దలకు తెలిసిందే ఏమోగానీ ఈ జంట దారుణ నిర్ణయం తీసుకున్నారు.
 
సోమవారం రాత్రి ప్రియుడి ఆమెకి ఫోన్ చేసాడు. ఇపుడే పాల ప్యాకెట్ తీసుకువస్తానని చెప్పి ఆ యువతి ప్రియుడి వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి సూరారెడ్డిపాలెం రైల్వే ట్రాక్ పైన పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఆ వైపుగా వెళ్లిన స్థానికులు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిచెందిన వారు ఇందు, విష్ణుగా గుర్తించారు. మృతదేహ భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments