Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గగుడిలో 22 నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (08:02 IST)
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ప్రతిఏటా ఆషాడం, శ్రావణ మాసాల్లో వైభవంగా నిర్వహించే శాకాంబరీ, అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ, శ్రావణ మాసోత్సవాలను ఈ ఏడాది కూడా యథావిధిగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చేనెల 22 నుంచి 24 వరకు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. గత నెల రోజులుగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలను సడలించడం, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో ఆషాడ, శ్రావణ మాసోత్సవాలు నిర్వహించే అంశంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ వైదిక కమిటీ సభ్యులు, పరిపాలన, ఇంజనీరింగ్‌, పూజల విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున కొవిడ్‌ నిబంధనలను పక్కా అమలు చేస్తూ, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా కొవిడ్‌ నిబంధనల నడుమ దుర్గగుడిలో శాకాంబరీదేవి ఉత్సవాలు, ఆషాఢ, శ్రావణ మాసోత్సవాలను నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా ఆయా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈవో సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments