Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గగుడిలో 22 నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (08:02 IST)
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ప్రతిఏటా ఆషాడం, శ్రావణ మాసాల్లో వైభవంగా నిర్వహించే శాకాంబరీ, అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ, శ్రావణ మాసోత్సవాలను ఈ ఏడాది కూడా యథావిధిగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చేనెల 22 నుంచి 24 వరకు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. గత నెల రోజులుగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలను సడలించడం, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో ఆషాడ, శ్రావణ మాసోత్సవాలు నిర్వహించే అంశంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ వైదిక కమిటీ సభ్యులు, పరిపాలన, ఇంజనీరింగ్‌, పూజల విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున కొవిడ్‌ నిబంధనలను పక్కా అమలు చేస్తూ, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా కొవిడ్‌ నిబంధనల నడుమ దుర్గగుడిలో శాకాంబరీదేవి ఉత్సవాలు, ఆషాఢ, శ్రావణ మాసోత్సవాలను నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా ఆయా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈవో సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments