Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన శిశువుల్ని కిడ్నాప్ చేసి.. అమ్మేస్తారు.. ముఠా అరెస్ట్

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:25 IST)
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శిశువులను కిడ్నాప్ చేసి.. అక్రమంగా విక్రయించిన నలుగురు మహిళలతో కూడిన ఏడుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను కిడ్నాప్ చేసే ఓ ముఠా.. దేశంలోని పలు ప్రాంతాల వారికి ఆ శిశువులను విక్రయిస్తూ.. బాగా డబ్బు గుంజుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసుల బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చిన్నారుల కిడ్నాప్ ముఠాకు చెందిన గంగాధర రెడ్డి అనే వ్యక్తితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఇటీవల ఒక నెల వయస్సుగల ఓ ఆడ శిశువు, రెండున్నర వయస్సున్న అబ్బాయిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. 
 
హైదరాబాదులో ఈ చిన్నారులను కిడ్నాప్ చేసి.. సంతానం లేని దంపతులకు రూ.2.5లక్షలు, రూ.3.10 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ముఠాకు చెందిన కిడ్నాపర్ల నుంచి ముగ్గురు చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అరెస్టయిన ఏడుగురి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం