Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఎస్ ఐ డైరెక్టరేట్ లో కార్మికశాఖ తనిఖీలు

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (20:39 IST)
సంచలనం రేకెత్తించిన రూ. 300 కోట్ల  ఈఎస్ఐ మందుల కుంభకోణం లో దర్యాప్తులో భాగంగా బుధవారం విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు.

అంతే కాకుండా కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం కిందట ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. మందుల కొనుగోళ్లలో ఏకంగా వందల కోట్లలో అక్రమాలు జరిగినట్లు బయటపడింది. మందులు సరఫరా చేయకుండానే కోట్లు కొట్టేసేందుకు కొందరు ప్రణాళికలు రచించారు.

ఏకంగా 300 కోట్ల మందులు, వైద్య సామాగ్రి కొనుగోళ్లపై అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన కార్మికశాఖ విచారణకు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే సమయంలో ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం బట్టబయలైంది.

మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధికర ధరలకు మందులు కొనుగోలు చేసి సుమారు రూ.200 కోట్లు కుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణియే సూత్రధారి అని నిర్ధారణ అయింది. అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments