Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దెలచెర్వు సూరి హత్య కేసు : పరిటాల రవి ఫ్యామిలీ హస్తం? నేడు తీర్పు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:18 IST)
అనంతపురం జిల్లాకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది. ఈ హత్య కేసులో టీడీపీ నేత దివంగత పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని హతుని భార్య గంగుల భానుమతి ఆరోపిస్తూవస్తోంది. ఈ క్రమంలో సూరి హత్య కేసులో తుది తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. 
 
కాగా, 2011, జనవరి 3వ తేదీన సూరి, అతడి ప్రధాన అనుచరుడు, అల్లుడుగా భావిస్తూ వచ్చిన భానుకిరణ్, డ్రైవర్ మధులు జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వైపు కారులో వెళుతున్నారు. అపుడు కొందరు పాయింట్ బ్లాంక్‌లో సూరిపై కాల్పులు జరిపి హతమార్చారు. 
 
ఈ కేసులో భూనుకిరణ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. అలాగే, డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు విచారణ సాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పలువురు వాంగ్మూలంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఈ కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments