Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష సర్పంతో సెల్ఫీ.. పామును మెడలో వేసుకుని ఫోజిచ్చాడు.. అంతే కాటేసింది..

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (11:39 IST)
స్మార్ట్‌ఫోన్ లేనిదే పొద్దు గడపని వారి సంఖ్య పెరిగిపోతుంది. 20వ శతాబ్ధంలో అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. స్మార్ట్‌ఫోన్లు చేతిలో పెట్టుకుని సెల్ఫీల పిచ్చిలో చాలామంది యువత ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీల కోసం యువత సాహసాలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ కోసం పాకులాడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
సూలూరు పేటకు చెందిన జగదీష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి.. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం సూళూరుపేట గ్రామం లో ఓ పాములోడు విష సర్పాలతో రోడ్డుపై ఆడిస్తుండగా.. జగదీష్ పాములతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబాకాడు. అంతేగాకుండా పామును మెడలో వేసుకున్నాడు. కానీ ఆ సర్పం జగదీష్‌ను కాటేసింది. 
 
వెంటనే స్థానికులు జగదీష్‌ను ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. పాము విషం శరీరంలోకి వేగంగా పాకడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు పాము పళ్లు పీకకుండా రోడ్డుపైకి పాములను తెచ్చిన పాములడు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments