Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం.. కరోనా బారిన పడిన వారిలో కూడా

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (14:44 IST)
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందనుకొనేలోపే బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో సైతం ఫంగస్ ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి 40 కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకమే అవుతుంది.
 
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారినపడి నిత్యం మరణిస్తున్నారు. దానికి తోడు తాజాగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 
 
ముఖ్యంగా కరోనా సోకి తగ్గిన వారిలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు... కరోనా సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో ఈ ఫంగస్ వెలుగుచూస్తోందని నిన్న మొన్నటి వరకు భావించారు. తాజాగా అసలు కరోనా సోకనివారిలో సయితం ఫంగస్ ఛాయలు కనిపిస్తుండడంతో మరో గుబులు మొదలైంది. 
 
ఏపీలో సోమవారం వరకు 1179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా అందులో 40 మంది కరోనా బారిన పడకుండా నేరుగా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 1068 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది బాధితులు మృతి చెందగా 97 మంది బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం