Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి.. కాపాడావా.. తిరుమలలో శేఖర్ రెడ్డి...

నోట్ల రద్దు సమయంలో 2 వేల రూపాయల కొత్త నోట్లను కోట్ల రూపాయలు మార్పిడి చేసి జైలు పాలయ్యారు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి. అప్పట్లో శేఖర్ రెడ్డి వ్యవహారం పెద్ద దుమారాన్నే రేగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వ

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (21:47 IST)
నోట్ల రద్దు సమయంలో 2 వేల రూపాయల కొత్త నోట్లను కోట్ల రూపాయలు మార్పిడి చేసి జైలు పాలయ్యారు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి. అప్పట్లో శేఖర్ రెడ్డి వ్యవహారం పెద్ద దుమారాన్నే రేగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన శేఖర్ రెడ్డి ఆ పరిచయంతోనే టిటిడి పాలకమండలి సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగలిగాడు. పదవి ఉండగానే ఆయనపై ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. 
 
అయితే అప్పట్లో శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కోట్ల రూపాయల కొత్త నోట్లను గుర్తించారు. ఆ కేసులో శేఖర్ రెడ్డి జైలు శిక్ష అనుభవించగా తాజాగా చెన్నై హైకోర్టులో వచ్చిన తీర్పుతో ఆయన బయటకు వచ్చేశారు. నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శేఖర్ రెడ్డి. అర్థరాత్రి దాటిన తరువాత తిరుమలకు వచ్చిన శేఖర్ రెడ్డి స్వామివారిని దర్శించుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనతో పాటు మరో ఇద్దరిని తోడుపెట్టుకుని శేఖర్ రెడ్డి తిరుమలకు వచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వద్దువద్దు అంటూ వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments