Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో 1.35 కేజీల బంగారం పట్టివేత

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:12 IST)
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 1.35 కేజీల బంగారాన్ని శ్రీకాకుళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన కె.సంతోష్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో 1,351 గ్రాముల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో కలిసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంతోష్‌ కుమార్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడ్ని ప్రశ్నించామని.. ఈ క్రమంలో సంతోష్‌ వద్ద ఉన్న బ్యాగులో 1,351 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు చెప్పారు.

పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రసీదు లేని బంగారంగా సంతోష్‌ తెలిపాడన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఓ బంగారు ఆభరణాల దుకాణదారుడు ఆర్డర్‌ ఇవ్వగా తాను తీసుకొచ్చినట్లు అంగీకరించాడని సీఐ వివరించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.65లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు.

సంతోష్‌ కుమార్‌ పర్లాకిమిడిలో ఓ బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేస్తామని సీఐ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments