Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో 1.35 కేజీల బంగారం పట్టివేత

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:12 IST)
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 1.35 కేజీల బంగారాన్ని శ్రీకాకుళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన కె.సంతోష్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో 1,351 గ్రాముల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో కలిసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంతోష్‌ కుమార్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడ్ని ప్రశ్నించామని.. ఈ క్రమంలో సంతోష్‌ వద్ద ఉన్న బ్యాగులో 1,351 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు చెప్పారు.

పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రసీదు లేని బంగారంగా సంతోష్‌ తెలిపాడన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఓ బంగారు ఆభరణాల దుకాణదారుడు ఆర్డర్‌ ఇవ్వగా తాను తీసుకొచ్చినట్లు అంగీకరించాడని సీఐ వివరించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.65లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు.

సంతోష్‌ కుమార్‌ పర్లాకిమిడిలో ఓ బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేస్తామని సీఐ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments