Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో 1.35 కేజీల బంగారం పట్టివేత

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:12 IST)
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 1.35 కేజీల బంగారాన్ని శ్రీకాకుళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన కె.సంతోష్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో 1,351 గ్రాముల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో కలిసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంతోష్‌ కుమార్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడ్ని ప్రశ్నించామని.. ఈ క్రమంలో సంతోష్‌ వద్ద ఉన్న బ్యాగులో 1,351 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు చెప్పారు.

పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రసీదు లేని బంగారంగా సంతోష్‌ తెలిపాడన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఓ బంగారు ఆభరణాల దుకాణదారుడు ఆర్డర్‌ ఇవ్వగా తాను తీసుకొచ్చినట్లు అంగీకరించాడని సీఐ వివరించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.65లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు.

సంతోష్‌ కుమార్‌ పర్లాకిమిడిలో ఓ బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేస్తామని సీఐ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments